- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ లో నూతన కోర్టు బిల్డింగ్ కోసం శనివారం మండలంలోని ఉమ్మాపూర్, పోతారం ఎస్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వములను జిల్లా జడ్జి సాయి రమాదేవి అదనపు జిల్లా జడ్జి హుస్నాబాద్ జూనియర్ సివిల్ జడ్జి రేవతి స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో ఆసిఫ్ హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ హు స్నాబాద్ తాహసిల్దార్ లక్ష్మారెడ్డి, హుస్నాబాద్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు యాల శ్రీనివాసరెడ్డి, ఒగ్గొజు సదానందం, కన్నోజు రామకృష్ణ ,జూమ్లాల్ నాయక్, హనుమయ్య, జే.కిరణ్ కుమార్, దీకొండ ప్రవీణ్ కుమార్, జే. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



