- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల ప్రజా పరిషత్ పాఠశాలలకు మంజూరైన నూతన భవనాలకు మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయనే మాట్లాడుతూ.. ఇటీవల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తాటిపాముల గ్రామంలో పర్యటించినప్పుడు ఆయా పాఠశాలలకు నూతన భవనాలను మంజూరు చేస్తామని చెప్పి నిధులు ప్రకటించడంతో స్థలాన్ని కాంట్రాక్టర్, ఇంజినీర్లతో కలిసి పరిశీలించినట్లు డీఈఓ తెలిపారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.

- Advertisement -