- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు శాంతి మార్గంతోనే పరిష్కారం అవుతాయని ప్రధాని మోడీ రాజ్యసభలో అన్నారు. హార్ముజ్లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఇతర ప్రత్యామ్నాయ మార్గాలన్నీ ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు. ఈ యుద్ధం సుదీర్ఘ కాలం జరిగితే సవాళ్లు ఏర్పడే అవకాశం ఉండటంతో అందుకు తగినట్టు చర్యలు చేపడుతున్నామన్నారు. భారత్ ప్రస్తుతం 41 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటోందని వివరించారు.
- Advertisement -



