Wednesday, December 31, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ

ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ

- Advertisement -

పీఆర్‌ డైరెక్టర్‌ శ్రీజనకు స్థానచలనం
నిజామాబాద్‌ కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు మంగళవారం ఉత్తర్వూలు జారీ చేశారు. పరిపాలనా విధానంలో బాగంగానే ఈ బదిలీ చేసామని చెప్పారు. పంచాయతీ రాజ్‌ శాఖ డైరెక్టర్‌ జి.శ్రీజనను జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బు Ûల్లాపూర్‌ అడిషనల్‌ కమిషనర్‌గా నిజామా బాద్‌ కలెక్టర్‌ టి.వినరు కృష్ణారెడ్డిని మల్కాజీగిరి, ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌ అడిషనల్‌ కమిషనర్‌గా, శృతి ఓజాకు . పంచాయతీ రాజ్‌ శాఖ డైరెక్టర్‌గా పూర్తి అదనపు భాద్యతలు అప్పగించారు. నల్లగొండ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి నిజామాబాద్‌ కలెక్టర్‌గా, సంగారెడ్డి అద నపు కలెక్టర్‌ బడుగు చంద్రశేఖర్‌ను నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా బదిలి చేశారు. వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌కు నారాయణపేట అడిషనల్‌ కలెక్టర్‌గా అదనపు భాద్యతలు అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -