- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భర్త మూఢనమ్మకానికి ఆరు నెలల గర్భిణి బలైంది. ఆదిలాబాద్ జిల్లా బంగారుగూడకు చెందిన యువతికి సేపుర్వార్ ప్రశాంత్తో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భవతి. నూతన ఇంటి పనులు చేపట్టడం, అదే సమయంలో భార్య గర్భవతిగా ఉండకూడదన్న మూఢనమ్మకంతో భర్త బలవంతంగా గర్భస్రావం మాత్రలు వేశాడు. ఆమెకు తీవ్ర రక్తస్రావమై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
- Advertisement -