మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘స్కై’. ఈ చిత్రాన్ని వాలోర్ ఎంటర్టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్లో నాగిరెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. పృథ్వీ పెరిచెర్ల దర్శకుడు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా నుంచి ‘జర్నీ ఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్’ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ శృతి శెట్టి మాట్లాడుతూ,’ఈ సినిమాలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. వీలైనంత త్వరగా మా సినిమాను మీ ముందుకు తీసుకురావాలని ఎగ్జైటింగ్గా ఉన్నాం. మా సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నచ్చుతుంది’ అని అన్నారు. ‘నన్ను నేను హీరోగా కంటే ఒక నటుడిగా భావిస్తా. ఈ సినిమాలో ప్రతిభ గల టీమ్తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. రీసెంట్గా మా మూవీ స్క్రీనింగ్ చేసినప్పుడు నా క్యారెక్టర్ను మర్చిపోయి సినిమాను ఎంజారు చేశా. మా టీమ్లో రసూల్ లాంటి చాలా ఎక్స్పీరిరున్డ్ టెక్నీషియన్ ఉండటం ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సినిమా విజయం ఖాయం’ అని హీరో, నిర్మాత మురళీ కృష్ణంరాజు చెప్పారు. సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ మాట్లాడుతూ, ‘ఒక కాంపాక్ట్ బడ్జెట్లో, పర్పెక్ట్గా ఒక మూవీ చేస్తే ఎలా ఉంటుంది అనేందుకు మా సినిమా ఎగ్జాంపుల్. ఛాలెంజింగ్గా తీసుకుని ఈ సినిమాకు ప్రతి ఒక్కరం పని చేశాం. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యామని నమ్ముతున్నాం. డైరెక్టర్ పృథ్వీ పొయెటిక్ కథతో చాలా ప్యాషనేట్గా ఈ మూవీని రూపొందించారు’ అని తెలిపారు. ‘డైరెక్టర్గా నాకు ఇది డెబ్యూ మూవీ. సినిమా మీద ప్యాషన్తో మేమంతా వర్క్ చేశాం. ఇటీవల మా మూవీ షో చూసి చాలా బాగుందని అంతా చెప్పారు. చాలా హ్యాపీగా ఫీలయ్యాం. మనకున్న బడ్జెట్లో మంచి సినిమా చేయగలం. ఆడియెన్స్కు ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలం అనే నమ్మకం కలిగింది. ఇలాంటి మంచి కథలు తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం’ అని డైరెక్టర్ పృథ్వీ పెరిచెర్ల చెప్పారు. ఆనంద్ భారతి, రాకేశ్ మాస్టర్, ఎంఎస్, కేఎల్ కే మణి బమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – పథ్వీ పెరిచెర్ల, డీవోపీ – రసూల్ ఎల్లోర్, ఎడిటర్ – సురేష్ యువర్స్, ప్రొడ్యూసర్స్ – నాగిరెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు, డైలాగ్స్, స్టోరీ – పృథ్వీ పెరిచెర్ల, మురళీ కృష్ణంరాజు, మ్యూజిక్ – శివ ప్రసాద్.