– రిటైల్ క్రెడిట్లో 5 శాతం తగ్గుదల
– గృహ రుణాల్లో 7 శాతం పతనం
న్యూఢిల్లీ : రుణాలు జారీలో మందగింపు చోటు చేసుకుంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో రిటైల్ రుణాల జారీలో 5 శాతం తగ్గుదల చోటు చేసుకుందని ట్రాన్స్యూనియన్ సిబిల్ ఓ రిపోర్ట్లో వెల్లడించింది. ముఖ్యంగా గృహ రుణాలు, క్రెడిట్ కార్డుల వ్యయాలు తగ్గాయని విశ్లేషించింది. మరోవైపు అన్సెక్యూర్డ్ రుణాల్లో మాత్రం 30 శాతం పెరుగుదల ఉండటం ఆందోళకరం. గడిచిన మార్చి త్రైమాసికంలో గృహ రుణాల్లో సంఖ్యా పరంగా 7 శాతం పతనం చోటు చేసుకోగా.. విలువ పరంగా 1 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. ఆస్తుల రుణాల్లోను వరుసగా 1 శాతం, 15 శాతం చొప్పున మందగిస్తుంది. విలువ పరంగా క్రెడిట్ కార్డుల వ్యయాలు ఏకంగా 32 శాతం క్షీణించాయి. ద్విచక్ర వాహన రుణాలు సంఖ్యా పరంగా 1 శాతం తగ్గగా.. విలువ పరంగా 2 శాతం పెరిగాయి. మరోవైపు వ్యక్తిగత రుణాలు విలువ పరంగా 6 శాతం పెరిగాయి. వాహన రుణాలు 1 శాతం, కన్సూమర్ డ్యూరెబుల్స్ రుణాలు 6 శాతం చొప్పున పెరిగాయని ట్రాన్స్యూనియన్ సిబిల్ వెల్లడించింది. ”ముఖ్యంగా యువ రుణ గ్రహీతలతో నెమ్మదిస్తున్న క్రెడిట్ డిమాండ్, వినియోగ రుణాల డిమాండ్పై ప్రతికూలను ప్రతిబింబిస్తుంది. ఇది సాధారణంగా యువ రుణగ్రహీతలకు ఉత్పత్తుల ఎంపిక. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల కోసం రుణాల స్థిరీకరణ, ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న ధోరణి అయినప్పటికీ, సానుకూలంగా ఉంది. బాధ్యతాయుతమైన రుణ పద్ధతుల ద్వారా మద్దతు ఇవ్వబడిన మెరుగైన తిరిగి చెల్లింపు ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది.” అని ట్రాన్స్యూనియన్ సిబిల్ సీఈఓ భవేష్ జైన్ తెలిపారు.