Sunday, June 1, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపొగచూరుతున్న బతుకులు

పొగచూరుతున్న బతుకులు

- Advertisement -

సిగరెట్లు, బీడీలు, హుక్కా పైపులు, గుట్కాలు, నసెం పొడులు, జర్థా, ఖైనీ, స్మోక్‌లెస్‌ టొబాకో లాంటి పలు రకాలైన పొగాకు ఉత్పత్తులు పలు ఆకర్షణీయ రూపాల్లో మనల్ని వశపరుచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటికి తోడుగా పొగరాయుళ్లతో తిరిగే స్నేహితులు, బంధువులు కూడా సెకండ్‌ హాండ్‌ స్మోకర్స్‌గా తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారు. అవగాహనలేమి లేదా తెలిసి కూడా పొగాకు ఉత్పత్తుల వాడకంతో నిండు ప్రాణాలు ప్రమాదంలో పడడం, చివరికి వైద్య ఖర్చులకు కుటుంబాలు బజారున పడడం, ప్రాణాలు కూడా పోవడం చూస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా పొగాకు దురలవాటుతో సాలీనా 8.7 మిలియన్ల మంది ప్రాణాలు పోతున్నాయని, అనేక మిలియన్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని గణాంక వివరాలు స్పష్టం చేస్తున్నాయి. పొగాకు రహిత సమాజ స్థాపన జరగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కషి చేయడం సముచితంగా ఉంది.
అనైతిక ప్రచార విష వలయంలో పడొద్దు
1988లో ఐరాస – డబ్ల్యూహెచ్‌ఓ చొరవతో పొగాకు దుష్ప్రభావాలను సామాన్య ప్రజలకు అవగా హన పర్చడంతో పాటు ఆ ఉత్పత్తుల వలలో పడకుండా హెచ్చరించడానికి ప్రతి యేటా 31 మేన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పాటించటం ఆనవాయితీ గా మారింది. ఈ ఏడాది ఇతివత్తంగా ”అన్‌మాస్కింగ్‌ ది అప్పీల్‌ (పొగాకు కంపెనీల విజ్ఞప్తుల గుట్టు విప్పడం)” అనే అంశంపై ప్రచారం చేస్తున్నారు. పొగాకు ఉత్పత్తు లను తయారు చేసే కంపెనీలు సువాసనలను వెదజల్లేం దుకు ఉపయోగించే పదార్థాలు, మార్కెటింగ్‌ విధానాల్లో అనైతిక పద్ధతులు, ఆకర్షణీయ ప్యాకేజీలు, ప్రముఖులతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వంటి పోకడలను వ్యతిరేకిస్తున్నది. పొగాకు పరిశ్రమలు గుప్పించే ప్రకట నల విషవలయంలో 37 మిలియన్ల మందికి పైగా 13-15 ఏండ్ల పిల్లలు చిక్కుకుపోతున్నారు. పొగాకు, నికోటిన్‌ ఉత్పత్తుల పరిశ్రమలు దాదాపు 16,000 రకాల సువాసన కలిగిన రసాయన పదార్థాలను కలుపుతున్నట్టు వెల్లడైంది.
పొగాకు ఉత్పత్తుల వాడకం – దుష్ప్రభావాలు
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.3 బిలియన్ల మంది ప్రజలు పొగాకు ఉత్పత్తుల దురలవాటుకు లోనైనట్టు, భారత్‌లో 15 ఏండ్ల పైబడిన 25.3 కోట్ల మంది ప్రజలు (పురుషులు, మహిళలు) ఈ దురలవాటు గుప్పిట్లో చిక్కుకుపోయినట్టు అంచనా. ప్రపంచ దేశాల్లో పొగాకు ఉత్పత్తులు వాడడంలో రెండవ స్థానంలో నిలుస్తున్న భారత్‌లో సెకండ్‌ హాండ్‌ స్మోకింగ్‌ కూడా అధికంగా ఉందని హెచ్చరిస్తున్నారు. పొగాకు వాడకం అభివద్ధి చెందుతున్న దేశాల్లోనే 80శాతం వరకు ఉందని గమనించాల్సిన విషయం. భారత్‌లో అత్యంత ప్రమాద కర ప్రజారోగ్య సమస్యల్లో పొగాకు వాడకం 5వ స్థానా న్ని ఆక్రమించింది. ఈ అలవాటుతో 18 శాతం హద్రోగ మరణాలు, 14 శాతం స్ట్రోక్‌లు, 60 శాతం ఊపిరితి త్తుల క్యాన్సర్‌ కారక మరణాలు నమోదవుతున్నాయి. పొగాకు వాడినపుడు విడుదలయ్యే పొగలో వేలకొద్ది రసాయనాలు విడుదలవుతున్నాయని తెలుసుకోవాలి. ఈ అలవాటు దీర్ఘకాలం కొనసాగితే ఊపిరితిత్తులు, నోరు, గొంతు, కాలేయం, మూత్ర పిండాలు, క్లోమం, గర్భాశయ, పెద్ద ప్రేగు క్యాన్సర్లకు దారి తీయడంతో పాటు ప్రాణాలను సహితం కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. పొగాకు ఉత్పత్తుల వాడకంతో ఊపిరితి త్తులు, గుండె, మధుమేహం, టిబీ, కంటి జబ్బులు, స్ట్రోక్‌ వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారు. గర్భవతులు పొగాకు వాడితే పిల్లల్లో తక్కువ బరువు, ముందస్తు ప్రసవాలు, శిశు అభివద్ధి మందగించడం వంటివి చోటుచేసుకుంటాయి. పొగాకులో ఉండే నికోటిన్‌ ప్రభావంతో ప్రాణాంతక పరిస్థితులు వస్తాయి.
పొగాకు ఉత్పత్తుల దురలవాటును తగ్గించేందుకు అనేక నియమనిబంధనలు, ప్రమాదరక సువాసనలిచ్చే పదార్థాల వినియోగాన్ని నిషేధించడం, నికోటిన్‌ ఉత్ప త్తులు వాడకపోవడం వంటి చర్యలను తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ దేశాలకు సూచిస్తున్నది. పొగాకు ఉత్పత్తుల అనైతిక మార్కెటింగ్‌ సరళిని అడ్డుకోవడం, పన్నులను పెంచడం, పొగ రహిత వాతావరణాన్ని నెలకొల్పడం నిరంతరం జరగాలి. ప్రభుత్వాలు, విద్యా వేత్తలు, వైద్య ఆరోగ్య సిబ్బంది, పౌర సమాజం సమైక్యంగా కలిసి పోరాడితే పొగాకు రహిత సమాజ స్థాపన సుసాధ్యమని తెలుసుకోవాలి. ఆరోగ్యంగా జీవించడం ఓ మానవ హక్కు అని తెలుసుకొని, పొగా కుకు దూరంగా ఉందాం. సంపూర్ణ ఆరోగ్యకర సమాజా నికి దగ్గరగా జీవితాలను సుసంపన్నం చేసుకుందాం. పొగాకు రహిత సమాజాన్ని స్థాపించుకుందాం.
(31 మే ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా)
– డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి
9949700037

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -