- Advertisement -
సన్మానించిన గ్రామస్థులు
నవతెలంగాణ – రామగిరి
రామగిరి మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన దాసరి మల్లి అనే యువరైతు గత వారంలో పొలం పనులు చేస్తుండగా.. పాముకాటు వేసింది. కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందాడు. ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడు. గ్రామములోని బొడ్రాయి వద్ద దాసరి మల్లిని మాజీ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.
- Advertisement -