- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని అన్ని గ్రామాలలో బుధవారం ఐకెపి కార్యాలయ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోషల్ మోబిలైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలో వృద్ధులు, కిశోర బాలికలు, వికలాంగులను గుర్తించి సంఘాలుగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సాయిలు, ఐకెపి సిబ్బంది, మహిళా సంఘం సభ్యులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -