- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్: ఆలూరు మండలం మిర్ధపల్లి గ్రామంలోని సౌడ సురేష్ హాస్టల్ వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన టిఎన్జీవో సోషల్ వెల్ఫేర్ల సంఘం జిల్లా అధ్యక్షునిగా సౌడ సురేష్ ఎన్నికయ్యారు. పదవ తరగతి మిత్రులు బృందం ఆదివారం అతనిని సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ యొక్క మిత్రుడు ఇంకా ఎన్నో మంచి స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాదపెల్లి మధు ,కళ్లెం ప్రవీణ్ రెడ్డి, మారంపల్లి సాయిరెడ్డి, నవీన్ ,రవి, షాదుల్లా సౌడ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -