- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గోవింద్ పేట్, మామిడి పల్లి గ్రామ సంఘ సభ్యులు క్రాప్ (అంజమాన్) లోన్ వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకోవాలని సొసైటీ సీఈఓ జి రమేష్ బుధవారం తెలిపారు. వడ్డీ కట్టని వారికి లోన్ లో అసలుని వడ్డీ తో కలిపి పెంచిన యెడల మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు (రుణ మాఫీ) అన్ని సమయాల్లో వర్తించక పోవచ్చునని, సకాలంలో కట్టని వారికి వడ్డీ రేటు 7%నుండి 13.75% అవుతుంది. అని తెలిపారు. రెన్యువల్ చేసుకున్న వారికి సెంట్రల్ గవర్నమెంట్ 3% వడ్డీ రాయితీ ఇస్తుంది. కావున సంఘ సభ్యులందరూ తప్పకుండా క్రాప్ లోన్ రెన్యువల్ చేసుకోవాలని సూచించారు.
- Advertisement -



