– రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్లాంటు ఏర్పాటు
– ఏడాదికి 90 లక్షల యూనిట్ల విద్యుత్ సద్వినియోగం
– సక్సెస్ ఆధారంగా సింగరేణి వ్యాప్తంగా ఏర్పాటుకు యోచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోనే మొదటి సారీగా సోలార్ ఎనర్జీ స్టోరేజి సిస్టమ్ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెట్ ఏర్పాటు చేసింది. మందమర్రి ఏరియాలో గల 28 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్కు అనుబంధంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) ను ఏర్పాటు చేశారు. పగటిపూట ఉత్పత్తి జరిగే సోలార్ విద్యుత్లో వినియోగించబడని మిగులను ఉచితంగా గ్రిడ్కు సరఫరా చేయకుండా, బ్యాటరీలో నిలువ చేసి అవసరమైనప్పుడు వాడుకునే అవకాశం ఉంది. ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన ప్రయోగాత్మక ప్లాంట్ను రెండు రోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్కు అందిస్తున్న ప్రోత్సాహకాన్ని అందిపుచ్చుకుని సింగరేణితో సహా పలు రాష్ట్ర సంస్థలు సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాయి. సింగరేణి సంస ఇప్పటికే తన ఏరియాల్లో 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇవి సమర్థంగా పనిచేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ విధంగా ఉత్పత్తి చేసే విద్యుత్ను తెలంగాణ ట్రాన్స్కో గ్రిడ్ ద్వారా అనుసంధానం చేసి సరఫరా చేస్తున్నారు. అయితే సింగరేణిలో డిమాండ్ లేని సమయాల్లో ఉత్పత్తి అవుతున్న సోలార్ విద్యుత్ను గ్రిడ్కు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతోంది. ఇలా మిగిలిపోయిన సోలార్ విద్యుత్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా నిల్వ చేసి గరిష్ట విద్యుత్ వినియోగం ఉండే సమయంలో కంపెనీ అవసరాలకు వినియోగిస్తారు. సాంకేతికపరంగా బీఈఎస్ఎస్ విధానాన్ని అత్యాధునికమైన నిల్వ, పొదుపు వ్యవస్థగా పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో 250 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో మందమర్రిలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 1 మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ తొలి అడుగని భావిస్తున్నారు. రూ.2.73 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్తో సింగరేణి సంస్థకు ఏడాదికి వినియోగించబడని దాదాపు 9.1 లక్షల యూనిట్ల సోలార్ విద్యుత్ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రూ.70 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. దీని ఫలితాలను భట్టి రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో సింగరేణి వ్యాప్తంగా అనువైన చోట్ల ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ సీఎండీ ఎన్.బలరాం తెలిపారు.
సింగరేణిలో సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



