- Advertisement -
చీకూరి లీలావతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీలో బోధన సౌకర్యాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు, యూనివర్సిటీ విద్యార్థి చీకూరి లీలావతి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యా బోధనలతో పాటు ప్రాక్టికల్స్ చేసేందుకు సరైన సదుపాయాలు లేక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు.
- Advertisement -



