Friday, May 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించండి

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించండి

- Advertisement -

సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ కొమరయ్య లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఉపాధ్యాయులు దీర్ఘకాలి కంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డికి బుధవారం ఆయన లేఖ రాశారు. ఉపాద్యా యులకు సంబంధించిన 22 సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని తెలి పారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యాశాఖలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని ఆయన స్వాగతిం చారు. సర్వీస్‌ రూల్స్‌ సమస్యను పరిష్కరించాలని తెలిపారు. నిర్దిష్ట కాలపరి మితిలోగా ఉపాధ్యాయులకు పదోన్నతులు చేపట్టాలని కోరారు. వేసవి కాలం లోనే ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల నిర్వహణకు షెడ్యూల్‌ను విడుదల చేయాలని పేర్కొన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరు ద్ధరించాలని తెలిపారు. మిగిలిపోయిన లాంగ్వేజ్‌ పండితులు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని పేర్కొన్నారు. పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -