- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: యూపీలోని ఘాజియాబాద్ జిల్లా మోదీనగర్లో దారుణం చోటుచేసుకుంది. ఇంటి విషయమై జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా రాహుల్ శర్మ అనే వ్యక్తి తన 65 ఏళ్ల తల్లిని గొంతు కోసి చంపేశాడు. అనంతరం అతనే స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాహుల్ను అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -



