- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆదివారం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఇక్కడి గ్యాస్ట్రో విభాగంలో చేరినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె వైద్యుల పరిశీలనలో ఉన్నట్లు తెలిపాయి. ఈ నెల 9న సోనియా ఇదే ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీనికి రెండు రోజుల ముందు శిమ్లాలోని ఇందిరాగాంధీ వైద్య కళాశాల ఆసుపత్రి (ఐజీఎంసీ)లో చేరిన విషయం తెలిసిందే. అధిక రక్తపోటుతో బాధపడుతున్న ఆమెకు వైద్యులు చికిత్స అందించారు.
- Advertisement -