నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) ఛైర్పర్సన్ సోనియా గాంధీ గురువారం నగరంలోని సర్ గంగా రామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఉదర సంబంధిత అనారోగ్యానికి చికిత్స పొందిన ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈమె ఇటీవల ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతూ జూన్ 15న ఢిల్లీలోని గాంగారామ్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. ఈ సందర్భంగా ఆమె త్వరగా కోలుకుంటున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ అజరు స్వరూప్ గురువారం తెలిపారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆమె ఆహారానికి సంబంధించి ప్రత్యేక డైట్ ప్లాన్ని సూచించామని, నిరంతరం ఆమెని పరిశీలిస్తున్నామని డాక్టర్ స్వరూప్ తెలిపారు.
సోనియా గాంధీ డిశ్చార్జ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES