Wednesday, June 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం ..

సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం ..

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ గద్దె వద్ద  తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగుర వేసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం కోసం జరిగిన దశాబ్దాల పోరాటాన్ని గౌరవించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకే సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారన్నారు. తెలంగాణ సమాజమంతా కాంగ్రెస్ పార్టీకి, అధినేత్రి సోనియా గాంధీకి ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి మండల ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య,  వైస్ చైర్మన్  సుంకేట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నిమ్మ రాజేంద్రప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల బుచ్చి మల్లయ్య, సింగిరెడ్డి శేఖర్, సల్లూరి గణేష్ గౌడ్, దూలూరి కిషన్ గౌడ్, అజ్మత్ హుస్సేన్, వేములవాడ జగదీష్, పాలెపు చిన్న గంగారాం, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -