Friday, July 4, 2025
E-PAPER
Homeజిల్లాలు10 మంది ఎస్ఐలను వివిధ పోలీస్ స్టేషన్ లకు అటాచ్ చేసిన ఎస్పీ 

10 మంది ఎస్ఐలను వివిధ పోలీస్ స్టేషన్ లకు అటాచ్ చేసిన ఎస్పీ 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో  10 ఎస్సైలను వివిధ పోలీస్ స్టేషన్లకు అటాచ్డ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. అటాచ్లో భాగంగా వీఆర్​లో​ ఉన్న నలుగురికి పోస్టింగ్​ ఇచ్చారు. ఇద్దరు ఎస్సైలను వీఆర్​కు అటాచ్ చేశారు. వీఆర్​లో ఉన్న నవీన్ చంద్రను జుక్కల్​కు  అటాచ్ చేశారు. రాఘవేంద్రను నస్రుల్లాబాద్ ఎస్సైగా అటాచ్ చేశారు. అరుణ్ కుమార్​ను పెద్ద కొడప్​గల్​గా ఎస్సైగా అటాచ్ చేశారు.

రాజారాంనకు కామారెడ్డి టౌన్ ఎస్ఐగా అటాచ్ చేశారు.  నస్రుల్లాబాద్ ఎస్సై పని చేసిన లావణ్యను రామారెడ్డికి అటాచ్ చేశారు. రాజంపేట ఎస్సై పుష్పరాజ్​ను సదాశివనగర్ ఎస్సైగా అటాచ్​ చేశారు. సదాశివనగర్ ఎస్సై రంజిత్​ను దేవునిపల్లి పీఎస్​కు అటాచ్ చేశారు. జుక్కల్ ఎస్సై  భువనేశ్వర్​ను దేవునిపల్లి-2 ఎస్సైగా అటాచ్ చేశారు.  దేవునిపల్లి ఎస్సై రాజు, పెద్ద కొడప్​గల్ ఎస్సై  మహేందర్​ లను వీఆర్​కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -