Saturday, July 19, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఆదిలాబాద్ లో ఆపరేషన్ జ్వాల ప్రారంభించిన ఎస్పీ 

ఆదిలాబాద్ లో ఆపరేషన్ జ్వాల ప్రారంభించిన ఎస్పీ 

- Advertisement -

జ్వాలతో విద్యార్థినిలలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం పెంపుదల
విద్యార్థినిలకు రక్షణగా నిలవనున్న ఆపరేషన్ జ్వాల
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్

విద్యార్థినిలకు స్వీయ రక్షణ ఎంతగానో ముఖ్యమైనదని ఆపద సమయంలో ఆదుకునేలా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని దానికి మొదలే స్వీయ రక్షణ ముఖ్యంగా ఉండాలనే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని పాఠశాలల మహిళా విద్యార్థినిలకు ప్రత్యేకంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆపరేషన్ జ్వాలా పేరుతో కరాటే శిక్షణ తరగతులన ప్రారంభిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ బాలికల కళాశాల, పాఠశాలలో జిల్లాలో మొట్టమొదటిసారిగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆపరేషన్ జ్వాల పేరుతో శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టారు. కరాటే శిక్షణ తరగతులను ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు, పలు ప్రభుత్వ, ప్రైవేటు కరాటే అధ్యాపకుల సహకారంతో శిక్షణను అందించనున్నట్లు తెలిపారు.

ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఒక గంట సమయం మహిళా విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణా తరగతులు ఉండనున్నట్లు, దీనికి సహకరించిన జిల్లా విద్యాశాఖ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఆపద సమయంలో ఆదుకునేందుకే జ్వాల జ్వాలా ముఖ్య ఉద్దేశం విద్యార్థులలో చిన్నతనం నుండి ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా జిల్లా పోలీస్ యంత్రాంగం తమ వంతు ప్రయత్నాన్ని మొదలుపెట్టిందని, దీని ద్వారా మహిళా విద్యార్థుల్లో చిన్నారులలో ఆపద సమయంలో స్వీయ రక్షణతో తమను తాము కాపాడుకునే ధైర్యాన్ని కలిగి ఉంటారని తెలిపారు. మహిళలు విద్యార్థులు ఎలాంటి ఆపద సమయంలోనైనా ఇలాంటి శిక్షణ కార్యక్రమాల వల్ల నేర్చుకున్న పద్ధతులను ఉపయోగించి తమను తాము కాపాడుకోగలుగుతారని, విద్యార్థుల ధైర్య సాహసాలు పెంపొందించబడతాయని, ఆపద సమయంలో జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించే అంత శక్తి లభిస్తుందని, మహిళలకు ఎల్లవేళలా అందుబాటులో జిల్లా షీ టీం బృందాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఎలాంటి ఆపద సమయంలోనైనా డయల్ 100 లేదా ఆదిలాబాద్ షీ టీం బృందాన్ని సంప్రదించాలని సూచించారు. మహిళల పట్ల జరుగు నేరాలను తగ్గించడానికి జిల్లాలో వినూత్నంగా ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని మహిళల్లో విద్యార్థినిలల్లో చైతన్యం తీసుకొని వచ్చి అన్ని రంగాల్లో ముందుండాలని సదుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని నేర్చుకోవాలని సూచించారు. ఈ పాఠశాలలో దాదాపు 500 మంది విద్యార్థులు ఆపరేషన్ జ్వాల ద్వారా శిక్షణ ను తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, కళాశాల ప్రధానోపాధ్యాయులు, పట్టణ సీఐలు, కరాటే శిక్షణను అందించే ప్రైవేటు ప్రభుత్వ అధ్యాపకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -