- Advertisement -
- – ఆర్టిసి టూర్ ప్యాకేజీలను వినియోగించుకోవాలి
– భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు
నవతెలంగాణ-భూపాలపల్లి - పుణ్యక్షేత్రాల విహారయాత్రలకు ప్రత్యేక బస్సులు కేటాయించడం జరిగిందని, కావున ప్రయాణికులు ఆర్టీసీ టూర్ ప్యాకేజీలను వినియోగించుకోవాలని భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ..
- టూర్ 1 :- ఒక్క రోజులో భూపాలపల్లి నుండి కొమురవెల్లి, కొండ పోచమ్మ వేములవాడ, కొండా గట్టు, ధర్మపురి సందర్మించి రాత్రి -భూపాలపల్లికి ఎక్స్ప్రెస్ బస్సు చేరుకుంటుందని. ఒక్కొక్కరికి రానూ- ఫోను చార్జీలు :-680 రూపాయలని వివరించారు.
- టూర్ 2 :-ఒక్క రోజులో భూపాలపల్లి నుండి భద్రచలం, పర్ణశాల , మల్లూరు దేవాలయాలను సందర్మించి రాత్రి -భూపాలపల్లికి ఎక్స్ప్రెస్ బస్సు చేరుకుంటుందని. ఒక్కొక్కరికి రానూ- ఫోను చార్జీలు:- 700 ఉంటుందన్నారు.
- టూర్ 3 = ఒక్క రోజులో భూపాలపల్లి నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సందర్మించి రాత్రి భూపాలపల్లికి ఎక్స్ప్రెస్ బస్సు చేరుకుంటుదని . ఒక్కొక్కరికి రానూ- ఫోను చార్జీలు:-770 ఉంటుందన్నారు.
- టూర్ 4 :- రెండు రోజులలో భూపాలపల్లి నుండి బీజపల్లి ఆంజనేయ స్వామి ఆలయం ఆలంపూర్ జోగులాలు దేవాలయాలను సందర్శించి మరుసటి రోజు రాత్రి భూపాలపల్లికి సూపర్ లగ్జరీ చేరుకుంటుదని ఒక్కొక్కరికి రానూ -పోనూ చార్జీలు:- 1700 ఉంటుందన్నారు
- టూర్ 5 : – రెండు రోజులలో భూపాలపల్లి నుండి విజయవాడ కనక – దుర్గా అమ్మవారి దేవాలయం, అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి సందర్శించుకొని మరుసటి రోజ రాత్రి భూపాలపల్లి కి సూపర్ లగ్జరీ చేరుకుంటుదని ఒక్కొక్కరికి రానూ…పోనూ చార్జీలు :-2150 ఉంటుందన్నారు. ఇలా ఐదు రూట్లలో పుణ్యక్షేత్రాలు బస్సులు నడపాలని నిర్ణయించాముని, కావున ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని ఆమె కోరారు. పూర్తి సమాచారం కోసం :- 9959226707, 9701967519, 9849425319, 9908336391 నెంబర్లను సంప్రదించాలన్నారు.
- Advertisement -