Tuesday, October 14, 2025
E-PAPER
Homeఆదిలాబాద్భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

- Advertisement -

నవతెలంగాణ  – జన్నారం
ప్రభుత్వం చేపట్టిన భూభారతి చట్టంలో భాగంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో భూ సంబంధిత సమస్యలపై అందిన దరఖాస్తులను పరిష్కారం పరిష్కరించడం పై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లాలోని జన్నారం మండలం మహమ్మదాబాద్ గ్రామానికి సంబంధించిన భూ సమస్యను అతి తక్కువ సమయంలో పరిష్కరించినందుకు గాను సంబంధిత గ్రామస్తులు  జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ను శాలువాతో సత్కరించి మొక్కను అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులు, మొఖా, సర్వే నెంబర్లు ఇతర పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని, ఇందు కొరకు  మండల అధికారి, తహసిల్దార్, ఆర్.ఐ. లతో బృందాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

మిస్సింగ్ సర్వే నెంబర్, ప్రాంతాల మార్పు, ప్రభుత్వ భూములు, సాదాబైనమా, అటవీ భూములు, హద్దుల నిర్ధారణ, ఇతర భూములకు సంబంధించి భూభారతి కార్యక్రమంలో పొందిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. భూ వివాదాలపై న్యాయస్థానం కంటే ముందు తమను సంప్రదిస్తే సమగ్ర విచారణ జరిపి అసలైన పట్టదారులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని, న్యాయస్థానాలలో కొనసాగుతున్న భూ వివాదాలకు సంబంధించిన కేసులపై ఎలాంటి చర్యలు తీసుకోబడవని తెలిపారు. జన్నారం మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన 457 ఎకరాలకు సంబంధించిన 170 కుటుంబాలు దాదాపు 100 సంవత్సరాలుగా భూ సమస్యలతో బాధపడుతున్నారని, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి సమస్యను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు మహమ్మదాబాద్ గ్రామ  రైతులు  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -