Saturday, October 4, 2025
E-PAPER
Homeకరీంనగర్సోమవారం నుంచి ప్రత్యేక తనిఖీలు

సోమవారం నుంచి ప్రత్యేక తనిఖీలు

- Advertisement -

జిల్లా ఇంచార్జి రవాణా శాఖ అధికారి వంశీదర్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

జిల్లాలో సరుకు, ప్రయాణికులను చేరవేసే వాహనాలకు సంబంధించిన 4,419 గల వాహనాల యజమానులు పన్ను చెల్లించాలని జిల్లా ఇంచార్జి రవాణా శాఖ అధికారి వంశీదర్  సూచించారు. ఆయా వాహనాలు రోడ్డు టాక్స్ కట్టకుండా వినియోగిస్తున్నారని తెలిపారు  సిరిసిల్ల డివిజన్ కు సంబంధించి 2,787 వాహనాలు, వేములవాడ డివిజన్ కి సంబందించి 1,632 వాహనాలు ఉన్నాయని వెల్లడించారు. అలాగే ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకుండా జిల్లాలో 11,425 వాహనాలు తిరుగుతున్నాయని తెలిపారు. సిరిసిల్ల రెవెన్యూ దివిజన్ లో 6,647, వేములవాడ డివిజన్ లో 4778 ఉన్నట్టు రికార్డ్ లో ఉందని పేర్కొన్నారు.  ట్యాక్స్, ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేని వాహనాల యజమానులు ట్యాక్స్ చెల్లించి ఫిట్ నెస్ చేయించుకోవాలని సూచించారు. ఈ నెల 6 వ తేదీ సోమవారం నుంచి ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కేసులు బుక్ చేసి సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -