- Advertisement -
నవతెలంగాణ – మద్దూరు
మండలంలోని రేబర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను మద్దూరు స్పెషల్ ఆఫీసర్ రాధిక గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామ్మోహన్, ఏవో రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి మాధవ్ జాదవ్, తదితరులు ఉన్నారు.
- Advertisement -