నవతెలంగాణ -ముధోల్
మండల కేంద్రమైన ముదోల్ ల్లోని బస్టాండ్ సమీపంలో గల ప్రభుత్వ బాలికల మైనార్టీ కలశాలను శుక్రవారం మండల ప్రత్యేక అధికారి సుదర్శన్, ఎంపిడివో శివకుమార్ లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల లోని వంటశాల, స్టాక్ రూము ,బోజనాలు, పాఠశాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలను సంబందిత ప్రిన్సిపాల్ కు, విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు, అలాగే నయబాధిలోని అంగన్వాడి సెంటర్ ను పరిశీలించి పలు సలహా సూచనల ను ఇచ్చారు. అంతేకాకుండా గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల ను పరిశీలించారు. లబ్ధిదారులకు సూచనలు ఇచ్చారు .అలాగే పారిశుద్యంపనులను పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా పారిశుద్ధంపై ప్రత్యేక శ్రద్దవహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవో అన్వర్ తదితరులున్నారు.
మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన ప్రత్యేక అధికారి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES