- Advertisement -
వ్యవసాయ శాఖ డైరెక్టర్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలవుతున్న జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించినట్టు డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్లు పదవులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించనున్నట్టు పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దీనికి సంబంధించిన అర్హతలు, జీతభత్యాలు, ఇతర నియమ, నిబంధనల వివరాల కోసం వ్యవసాయ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.
- Advertisement -



