- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
శ్రావణ మాస నాలుగవ శనివారం పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ ఈఈ రవీందర్ బాబు మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అధికారి ఇక్కడ వచ్చిన నాటినుండి ప్రతి సోమ శనివారాల్లో అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకంగా దర్శించుకుంటారు. శ్రావణమాసం సందర్భంగా నాలుగవ శనివారం అయినందున ప్రత్యేకంగా సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారి వేణు పూజారి చేత పూజలు చేయించారు. డిప్యూటీ ఈ ఈ వెంట పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -