Friday, September 19, 2025
E-PAPER
Homeఖమ్మంపట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక పర్యవేక్షణ: కమీషనర్ నాగరాజు

పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక పర్యవేక్షణ: కమీషనర్ నాగరాజు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : మున్సిపాల్టీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పారిశుధ్యం పై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని, ఈ పనులు నిర్వహించే వారు ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని నూతనంగా వచ్చిన మున్సిపల్ కమీషనర్ బి.నాగరాజు అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని పలు వీధులను,మురికి కాలువలను పరిశీలించారు.వీధులను శుభ్రంగా ఉంచాలని అన్నారు. వీధి లైట్లు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి అవసరం అయిన చోట్ల బల్బులు అమర్చాలి అని ఎలక్ట్రిసిటీ సిబ్బందికి సూచించారు.నర్సరీల లో మొక్కలు ను సిద్దం చేయాలని,ప్రతీ మొక్క కు జియో ట్యాగ్ ఉంటుందని తెలిపారు. ఆయన వెంట పలువురు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -