నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతం చేయాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ కోరారు. గురువారం మండలంలోని అమీర్ నగర్, ఇనాయత్ నగర్, దొమ్మరి చౌడు తండా, నర్సాపూర్, గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ప్రగతిని ఆయన పరిశీలించారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే లబ్ధిదారులు వెంటనే పంచాయతీ కార్యదర్శుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఇండ్ల నిర్మాణం కోసం అవసరమైన ఇసుక, మొరంను గ్రామ పంచాయతీ నుండి ఇండెంట్ తెచ్చుకుంటే తహసిల్దార్ కార్యాలయంలో వేబిల్స్ ఇప్పిస్తామన్నారు.ఇండ్ల నిర్మాణంలో మాత్రం జాప్యం లేకుండా వేగంగా పూర్తయ్యేలా లబ్ధిదారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే దశలవారీగా బిల్లులు చెల్లించడం జరుగుతుంది అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు జులేఖ, శ్రీలత, అజయ్, పద్మ, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES