– స్కూల్ జీవితం ఉన్నతమైన జీవితానికి పునాది – వందేమాతరం రవీందర్ రావు
నవతెలంగాణ – రాయపర్తి: మండలంలోని కాట్రపల్లి గ్రామంలో సెయింట్ మేరీ స్కూల్లో 2018 -నుంచి 2024 సంవత్సరం వరకు 10వ తరగతి చదివిన ఆరు బ్య బ్యాచ్ ల విద్యార్థులు ఆదివారం ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వందేమాతరం ఫౌండేషన్ చైర్మన్ రవీందర్ రావు మాట్లాడుతూ.. విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అవరోదించడానికి స్కూల్ జీవితం ఒక పునాది వంటిది అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి సెయింట్ మేరీ స్కూల్ నిర్వహించడం అభినందనీయం అని కొనియాడారు. స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమన్నారు. జీవితంలో ఎంత ఎత్తు ఎదిగిన చదువుకున్న స్కూల్ ను మరువకూడదు అన్నారు. తదుపరి పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు తిరిగి అదే పాఠశాలలో కలుసుకొని నాటి మధుర జ్ఞాపకాలను ఒకరికొకరు పంచుకొంటూ సందడి చేశారు. దీంతో సెయింట్ మేరీ స్కూల్ ఆవరణం ఆనంద పరవశంతో నిండింది. చదువుకున్న రోజుల్లోని జ్ఞాపకాలను పంచుకొని ఉబ్బితభిపోయారు. కలిసి చదువుకున్న తరగతి గదులను, బ్లాక్ బోర్డులను చూసుకుంటూ ఒక్కింత భావోద్వేగానికి గురయ్యారు. అందరూ కలిసి విందు భోజనాలు అరగించి గ్రూప్ ఫొటోలు దిగి నూతన జ్ఞాపకాలను పదిలం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ శిబుపాల్ డైరెక్టర్లు వెంకట్ రెడ్డి, సోమన్న, రవీనా – రోజు, రమేష్, సుదాకర్ తదితరులు పాల్గొన్నారు.
సెయింట్ మేరీలో ఆత్మీయ సమ్మేళనం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES