నవతెలంగాణ – కాటారం
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం గిరిజన గురుకుల స్పోర్ట్స్ పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు రీజినల్ కోఆర్డినేటర్ హరి సింగ్ గారి ఆదేశం మేరకు, భూపాలపల్లి జిల్లా డిసిఓ/ స్థానిక గిరిజన గురుకుల బాలుర కళాశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏటూరు నాగారం స్పోర్ట్స్ బాలుర పాఠశాలలో 5వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తామని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈనెల 8 మరియు 9న ఏటూరు నాగారంలో ఉన్న స్పోర్ట్స్ గురుకుల బాలుర పాఠశాలలో ఆధార్ కార్డ్ ,కులము ఆదాయం స్టడీ సర్టిఫికెట్స్ తో స్పాట్ కౌన్సిలింగ్ కి ఉదయం8:00 గంటల నుండి హాజరు కావాలని వెల్లడించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.
ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES