హైదరాబాద్ : క్రాప్ట్, డిజైన్, ఆభరణాల సమాహారం ‘ది కలెక్టిబుల్స్’ సందడిగా జరిగింది. శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్లోని సత్వ సిగేచర్ టవర్స్లోని థియరీ ఆఫ్ ఎవ్రితింగ్లో జరిగిన ఈ వేడుకను ఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఎంఇఐఎల్ డైరెక్టర్ సుధారెడ్డి లాంచనంగా ప్రారంభించారు. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డి, థియరీ ఆఫ్ ఎవ్రితింగ్ వ్యవస్థాపకురాలు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ కుమార్తె ఐశ్వర్య హెగ్డే, ప్రముఖ ఎంటర్ప్రిన్యూర్ పింకీ రెడ్డి హాజరై సందడి చేశారు. ఇక్కడ ప్రదర్శించిన గాజు ముత్యాలు, బంగారం, వెండి, వజ్రాలు, రత్నాల కలయికతో కూడిన ప్రతి ఆభరణం ఒక కథగా నిలుస్తుందని సుధా రెడ్డి, ఐశ్వర్య హెగ్డే తెలిపారు.



