- Advertisement -
- – కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య
- నవతెలంగాణ – మల్హర్ రావు
- మండలంలోని కోయ్యుర్ నుంచి కొండంపేట వరకు బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆదివారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు,శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ళ శీను బాబు మొట్టమొదటిసారిగా మంథని నియోజకవర్గంలోని మల్హర్ రావు మండలానికి సోమవారం విచ్చేస్తున్న సందర్భంగా స్వాగతం పలకడానికి మధ్యాహ్నం 2 గంటలకు ర్యాలీ ప్రారంభోత్సవం అవుతుంది కావున మండలంలోని అన్ని గ్రామాల నుండి మాజీ ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,యూత్ నాయకులు, మహిళ నాయకురాళ్ళు, అన్ని అనుబంధాల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
- Advertisement -