Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీకి శ్రీనిత్ ఎంపిక

సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీకి శ్రీనిత్ ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ –  ఆర్మూర్
పాత కలెక్టర్ గ్రౌండ్ లో జరిగిన అండర్ 14 ఇయర్ సబ్ జూనియర్ కబడ్డీ విభాగంలో ఆలూరు పాఠశాలకు చెందిన 8వ తరగతి చదువుతున్న శ్రీ నిత్ ఆ యొక్క టోర్నమెంట్లో మంచి ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లాలకు ఎంపికయ్యాడు. మంగళవారం జరిగిన ఉమ్మడి జిల్లాల సబ్ జూనియర్ అండర్ 14 ఇయర్స్ బాయ్స్ కబడ్డీ విభాగంలో శ్రీనిత్ పాల్గొని రాష్ట్రస్థాయి కబడ్డీకి ఎంపికయ్యారు. ఈ యొక్క రాష్ట్రస్థాయి కబడ్డీ కిఎంపిక కాబడ్డ శ్రీనిత్ 16వ తేదీ నుంచి సంగారెడ్డి లో జరిగే సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొంటాడు. 

రాష్ట్రస్థాయి కబడ్డీకి ఎంపిక అయినందున ఆలూరు మండల విద్యాశాఖ అధికారి , పాఠశాల హెచ్ఎం నరేందర్  పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజేష్ ని అభినందించారు. సందర్భంగా ఎంఈఓ  మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబరచాలని మరి భవిష్యత్తులో ఇలాంటి రాష్ట్రస్థాయి జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. పి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అశ్వత్ అహ్మద్  వీరిని అభినందించడం జరిగింది  పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు గ్రామ వీడికి సభ్యులు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజేష్ , కబడ్డీలో మంచి ప్రతిభ కనబరిచిన శ్రీనిత్ ను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -