- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ ఛీఫ్ (ఈఎన్సీ) అడ్మిన్గా తమటం శ్రీనివాస్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా సర్క్యూలర్ జారీ చేశారు. కామారెడ్డి ఈఎన్సీగా ఉన్న శ్రీనివాస్కు పూర్తి అదనపు (ఎఫ్ఏసీ) బాధ్యతలు అప్పగించినట్టు పేర్కొన్నారు. ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని సర్క్యూలర్లో తెలిపారు.
- Advertisement -



