- Advertisement -
హైదరాబాద్ : మాజీ ప్రపంచ చాంపియన్, 4సార్లు జాతీయ చాంపియన్ కె. శ్రీనివాస్ (తెలంగాణ) 3వ మహారాష్ట్ర ఓపెన్ క్యారమ్ చాలెంజర్స్ ట్రోఫీ విజేతగా నిలిచాడు. 501 మంది పోటీపడిన ఈ టోర్నమెంట్లో కె. శ్రీనివాస్ సత్తా చాటాడు. ఫైనల్లో అభిషేక్ చౌహాన్ (మహారాష్ట్ర)పై 9-20, 23-0, 25-4తో ఘన విజయం సాధించింది. శ్రీనివాస్ ట్రోఫీతో పాటు రూ.1.5 లక్షల నగదు బహుమతి దక్కించుకున్నారని క్యారమ్ అసోసియేషన్ తెలంగాణ ఆర్గనైజింగ్ కార్యదర్శి శోభన్రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు.
- Advertisement -



