- Advertisement -
మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు తర్వాత అత్యధిక చిత్రాలు నిర్మించిన వ్యక్తిగా, శతాధిక చిత్ర నిర్మాతల్లో రెండవ వాడిగా భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ పేరొందారు. ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 15 చిత్రాల నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు. ప్రపంచ రికార్డుగా నమోదు కానున్న ఈ చారిత్రక ఘట్టానికి హైదరాబాద్లోని సారధి స్టూడియో వేదిక కానుంది. సినిమా రంగంతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రపంచ రికార్డుకు ప్రత్యక్ష సాక్షులు కానున్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ అరుదైన ఘట్టం ప్రారంభం కానుండటం విశేషం.
- Advertisement -