Saturday, June 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభూ సమస్యలపై జులై 4న రాష్ట్ర సదస్సులు

భూ సమస్యలపై జులై 4న రాష్ట్ర సదస్సులు

- Advertisement -

– సర్వేలు చేసి ఆక్రమణ భూములు వెలికితీస్తాం
– ప్రభుత్వం కూడా సర్వే చేసి మిగులు భూమిని పేదలకు పంచాలి

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వర్క్‌షాపులో ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షులు సారంపల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో భూ సమస్యలపై జులై 4న రాష్ట్ర సదస్సులు నిర్వహించి పోరాటాలకు సిద్ధం కావాలనీ, పెద్దల చేతుల్లో ఆక్రమణలకు గురైన భూములను బయటకి తీసుకేందుకు ప్రత్యేక భూ సర్వేలు చేయాలని ఏఐకేఎస్‌ అఖిల భారత ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అధ్యక్షతన భూ సమస్య అనే అంశంపై రాష్ట్ర స్థాయి వర్క్‌షాపును నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో అనేక రకాల మిగులు, దేవాదాయ, చెరువు శిఖం, అసైన్డ్‌ భూములు పెద్దల చేతిలో ఆక్రమణకు గురయ్యాయన్నారు. వాటిని బయటికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సర్వే చేయాలనీ, ఆక్రమణ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. ధరణి, భూభారతి వంటి చట్టాలు పెద్దవాళ్లకే ఉపయోగపడుతున్నాయి తప్ప పేదలకు ఉపయోగం లేకుండా పోతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండాపోయిందన్నారు. ఆక్రమణలకు గురైన అసైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్రాములు, ఆ సంఘం రాష్ట్ర ఆఫీసు బేరర్లు బి ప్రసాద్‌, కొండమడుగు నరసింహ్మ, అన్నవరపు కనకయ్య, ఆవుల వీరన్న, సమ్మయ్య, ములకలపల్లి రాములు పెద్ది వెంక ట్రాములు, మేకల ఆంజనేయులుతో పాటు రేపాకుల శ్రీనివాస్‌, మెరుగు సత్యనారాయణ, వెంకట్‌ మావో, నరసింహ, ఎం. సైదులు గుమ్మడిరాజుల రాములు, సంపత్‌, నరసింహులు, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -