Friday, May 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి..

రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి..

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : జూన్ 21, 22వ తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శి ఎం. ముతేన్న, ఆర్.రమేష్ పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని హాసకోత్తుర్ గ్రామంలో సిజే పటేల్ బీడీ సెంటర్ లో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం కరపత్రాలను అవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం కార్మికులపై కక్ష కట్టి  చట్టాలను రద్దుచేసి కోడ్ చట్టాలను  తీసుకొచ్చిందన్నారు. కార్మికుల కడుపు కొట్టి సామ్రాజ్యవాదులకు, సంపన్నులకు దోచి పెట్టడానికే  ఈ కొత్త చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు. 8 గంటల పని దినాలు పోయి పన్నెండు గంటల పని దినంగా కేంద్ర ప్రభుత్వం కల్పించి, కార్పొరేట్ల సేవ చేయడానికి పూనుకుంటుందన్నన్నారు. కార్మిక వర్గం సంక్షేమం పట్టని కేంద్రం, అనేక కార్మిక వ్యతిరేక చర్యలు తీసుకుంటుందన్నారు. రోజురోజు ఉపాధి కోల్పేయి కార్మిక వర్గం నిరుద్యోగులుగా మారి కటిక దరిద్రులుగా మారాలని చూస్తుందన్నారు. కార్మిక వర్గం సమ్మె హక్కును కూడా లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి అనేక హామీలు ఇచ్చినప్పటికీ, కార్మికుల సంక్షేమం కోసం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు. కార్మిక వర్గం మన సమస్యల పరిష్కారం కోసం పోరాటమే మార్గంగా ఎంచుకొని పనిచేయాలన్నారు. జూన్ 21, 22న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో  ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయుసీఐ) రాష్ట్ర మహాసభలు  జరగనున్నాయని, కార్మికులు, మేధావులు, విద్యార్థులు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో జిల్లా యూనియన్ ఉపాధ్యక్షులు సతేమ్మ, జిల్లా నాయకులు కే.రాజేశ్వర్, బీడీ ప్యాకర్స్  గంగాధర్, బాలయ్య, బషీర్, నర్సయ్య, కిషన్, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -