Wednesday, June 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేంద్రంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

కేంద్రంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

- Advertisement -

రెపరెపలాడిన నువ్వెన్నల జెండా
నవతెలంగాణ – మద్నూర్
: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మద్నూర్ మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. మొట్టమొదట మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం వేడుకలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణంలో గ్రామ పెద్దలకు సీట్లను పంచిపెట్టారు. అదేవిధంగా మండల కేంద్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ ఎండి ముజీబ్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రాణి మద్నూర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ సౌజన్య రమేష్ మద్నూర్ సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ పోలీస్ స్టేషన్లో ఎస్సై విజయ్ కొండ ప్రభుత్వ ఆస్పత్రిలో సూపర్డెంట్ ఆనంద్ జాదవ్ ఎస్ టి ఓ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ పవన్ కుమార్ పంచాయతీ రాజ్ ఉప కార్యనిర్వాహణ కార్యాలయంలో డిప్యూటీ ఈ ఈ రవీంద్రబాబు ఐకెపి మండల మహిళా సమైక్య కార్యాలయంలో అధ్యక్షురాలు రేణుక ఈ విధంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వివిధ పార్టీల కార్యాలయాల్లో జాతీయ పతాకాలని ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -