నవతెలంగాణ – మల్హర్ రావు: మండల కేంద్రంలో తెలంగాణ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘణంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్లలోని తహశీల్దార్ కార్యాలయం, ఎంపిడిఓ కార్యాలయం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు అన్ని గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు, జాతీయ కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ, వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఆర్టీఐ, నేషనల్ హ్యూమన్ రిట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. పలువురు అమరుల త్యాగపలమే తెలంగాణ రాష్ట్రమని, రాష్ట్రం కోసం విలువైన ప్రాణాలనర్పించిన అమరుల త్యాగాలను ఉజ్వలంగా స్మరించుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవికుమార్, ఎంపిడిఓ శ్రీనివాస్, తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,వైస్ ఛైర్మన్ ప్రకాష్ రావు,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, సింగిల్ విండో డైరెక్టర్లు వొన్న తిరుపతి రావు, సంగ్గేం రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అయిత రాజిరెడ్డి, జిల్లా ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, ప్రధాన కార్యదర్శి మావురపు వెంకన్న, మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ, ప్రధాన కార్యదర్శి తెప్పల రజిత, కొయ్యుర్ మాజీ ఉప సర్పంచ్ కొండూరి మమత, ఆయా గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్, బిఆర్ఎస్, ఆర్టీఐ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, ప్రజా సంఘాల నాయకులు, యువత, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.
ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES