జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎస్పీ కిరణ్ ఖరే
నవతెలంగాణ – భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… జిల్లా ప్రజలకు పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం, అభివృద్ధి చెందడంలో రాష్టం కోసం జీవితాల్ని త్యాగం చేసిన అమరవీరుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. సమాజం ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ సేవలను గురించి ప్రసంగించారు. “తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పోలీస్ శాఖ కీలక భూమిక పోషిస్తోందని, ప్రజల రక్షణ మరియు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల కృషి ప్రశంసనీయమైనదనీ, పోలీసు అధికారులు, సిబ్బంది నిబద్ధతతో క్రమశిక్షణతో సేవలందించాలని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, న్యాయం, సమానత్వం, భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తోందనీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో పోలీస్ శాఖ సిబ్బంది మనస్ఫూర్తిగా కర్తవ్య నిర్వహణ చేయాలని మరియు అధికారులు సిబ్బంది క్రమశిక్షణతో మరింత బాధ్యతగా పనిచేసి, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయి లో జిల్లాకు మంచి పేరు, కీర్తి ప్రతిష్ట లు తీసుకురావాలని ఎస్పీ కిరణ్ ఖరే గారు కోరారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి ఎస్పీ గారు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్సీ ఆంగోతు నరేష్ కుమార్, ఏ ఆర్ అదనపు ఎస్పీ వి. శ్రీనివాస్, డీఎస్పీలు సంపత్ రావు, నారాయణ నాయక్, డిపిఓ ఏవో వసీం ఫర్హాన, జిల్లా పరిధిలోని సీఐలు, రిజర్వు ఇన్స్పెక్టర్ లు, ఎస్సై లుపాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES