Wednesday, June 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ..

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ..

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను సోమవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ గుడిమెల ప్రసాద్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అనిల్ రెడ్డి, మండల విద్యా వనరుల కేంద్రం వద్ద ఎంఈఓ ఆంధ్రయ్య, కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద చైర్మన్ పాలెపు నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద అధ్యక్షులు సుంకేట రవి, బిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయం వద్ద మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, ఆయా గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయ వద్ద గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహలకు పూలమాలలు వేసి, తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి అమరులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాకముందు ఉద్యోగాలు, నిధులు, నీళ్లు, నియామకాలలో ఆంధ్ర వారి పాలనలో అణిచివేతకు గురయ్యి తొలి దశ, మలిదశ ఉద్యమం ద్వారా పోరాటం చేసి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సాధించినటువంటి ఫలితాలను వివరించారు. కుల, మత, వర్గ బేధం లేకుండా అందరం కలిసికట్టుగా ఉత్సవాలను జరుపుకుంటూ ఇదే స్ఫూర్తితో మండలాన్ని అన్ని రంగాలలో ముందుండేలా సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఏపిఎం కుంట గంగారెడ్డి, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మండల, గ్రామస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -