Wednesday, June 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు 

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – పరకాల : పరకాలలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో,పట్టణ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది.పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంతో పాటు అమరధామంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పరకాల తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ విజయలక్ష్మి,ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ ఆంజనేయులు, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లు,సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రార్ దామెర సృజన్ కుమార్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ చౌహాన్, వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరించి ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -