నవతెలంగాణ – ఆర్మూర్ : బహుజనులకు రాజ్యాధికారం అత్యవసరమని సమత సైనిక్ దళ్ రాష్ట్ర కోఆర్డినేటర్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు డి.ఎల్ మాల అన్నారు. పట్టణంలోని ఆదివారం ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ కార్యాలయంకు విచ్చేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం అత్యవసరం,అనివార్యం,అని ముఖ్యంగా బీసీలు యం.ఎల్.ఏ. లు కావాలి అనే నినాదం ప్రజల్లో మారు మోగుతుంది అని, ఎక్కువ జనాభా , ఎక్కువ రాజ్యాధికారం ,మన వాటా దిశగా మనం అడుగులు వేయాలని అన్నారు. “కార్యకర్తలను,నాయకులను, ఎలా తయారు చేసుకోవాలి”సిద్ధాంత పుస్తకాని చైర్మన్ రాజశేఖర్ డి.ఎల్ .మాల బహుకరించారు.. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మోర్తాడ్ మండల అధ్యక్షులు అంగూలి మాల,చిత్తాపూర్ రాజు,రాంప్రసాద్,ఇస్తాకొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
బహుజనులకు రాజ్యాధికారం అత్యవసరం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES