Tuesday, June 17, 2025
E-PAPER
Homeఖమ్మంపామాయిల్ క్షేత్రాలను పరిశీలించనున్న రైతు సంఘం రాష్ట్ర బృందం

పామాయిల్ క్షేత్రాలను పరిశీలించనున్న రైతు సంఘం రాష్ట్ర బృందం

- Advertisement -

వంద్యత్వ మొక్కలు బాధితుల పరామర్శ…
ప్రత్యక్ష కార్యాచరణకు రూపం…
సంఘం రాష్ట్ర నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలపై తెలంగాణ పామాయిల్ రైతు సంఘం ప్రత్యక్ష కార్యాచరణకు నడుం బిగించింది. ఈ క్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ తో కూడిన బృందం ఒకటి మంగళవారం సత్తుపల్లి,దమ్మపేట,అశ్వారావుపేట మండలాల్లోని ఆయిల్ ఫాం క్షేత్రాలను,పరిశ్రమలను పరిశీలించడం తో పాటు వంద్యత్వ మొక్కలు తో పంట దిగుబడి రాక ఆర్ధికంగా నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు.

ఈ నేపధ్యంలో ఈ తెలంగాణ పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్య సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ పర్యటన కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న వంద్యత్వ మొక్కలు సమస్య పై గత రెండేళ్ళుగా ఆయిల్ఫెడ్ యాజమాన్యానికి,రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్,సీఎం రేవంత్ రెడ్డి లకు రాతపూర్వక విన్నపాలు ఎన్ని ఇచ్చినా చెవిటోడి ముందు శంఖం ఊదిన చందంగా వ్యవహరించారని అన్నారు.

ఇంత జరుగుతున్నా ఖమ్మం జిల్లా,సత్తుపల్లి మండలం రేగళ్ళపాడు నర్సరీ లో వంద్యత్వ మొక్కలు ఉన్నాయని ఆయిల్ ఫెడ్ అధికారులే నిర్ధారించి తిరిగి వాటిని పోషిస్తున్నారని అన్నారు.ఇందులో అంతరార్ధం ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం వ్యవసాయ తరుణం రావడంతో రైతులకు మొక్కలు ఇస్తున్నారని వీటిలో నాణ్యత ప్రశ్నార్ధకమే అన్నారు.ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు ప్రమేయం లేకుండానే ఇక్కడి అధికారులు మొక్కలు ఇష్టానుసారం రైతులకు మొక్కలు పంపిణీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడానికి సంఘం ప్రత్యక్ష కార్యాచరణకు మంగళవారం తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి సింగర్,భద్రాద్రి కొత్తగూడెం అధ్యక్ష కార్యదర్శులు అన్నవరపు సత్యనారాయణ,యలమంచిలి వంశీ క్రిష్ణ,ఖమ్మం జిల్లా నాయకులు బొంతు రాంబాబు,ఆయిల్ ఫాం గ్రోయర్స్ రాష్ట్ర నాయకులు తుంబూరు మహేశ్వర రెడ్డి ఈ పర్యటనలో పాల్గొంటారని తెలిపారు.పెద్ద ఎత్తున ఆయిల్ ఫాం సాగు దారులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -