Saturday, May 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కూచూరులో ప్రారంభమైన విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం

కూచూరులో ప్రారంభమైన విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – నవాబుపేట
మండల పరిధిలోని కూచూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాలయాలలో బుధవారం దేవతా విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ  వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి,శ్రీ సీతారాములు, శివపార్వతులు,కోట మైసమ్మ, కట్ట మైసమ్మ, పోచమ్మ, పోతురాజు,నాగదేవతలు, నాభిశిల (బొడ్రాయి) విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం  వేద పండితుల మంత్రోచ్చారణలు, గ్రామస్తుల జయ జయ నాదాల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని  కార్యక్రమ నిర్వాహకులు గ్రామంలోని శ్రీ శివాంజనేయ స్వామి దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించగా,అందులో వేద పండితులు దేవతా విగ్రహాలకు గురువందనం,గణపతి పూజ, గోపూజ పుణ్యాహవాచనం, పంచగవ్యప్రాశ, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, సర్వతోభద్రల మండలం, నవగ్రహ, వాస్తు, క్షేత్ర, పాలక, యోగినీ మండల ఆరాధన, ఆవాహిత దేవత పూజలు, ఆవాహిత దేవత హోమాలు, జలాధి వాస కార్యక్రమాలు, చతుర్వేద పారాయణం, మహా మంగళహారతి కార్యక్రమాలను  శాస్త్రోక్తంగా అత్యంత ఘనంగా నిర్వహించారు. వర్షం జోరుగా కురుస్తున్న లెక్కచేయకుండా వందలాదిమంది భక్తులు పూజా కార్యక్రమాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పూజలలో పాల్గొన్న భక్తులకు కార్యక్రమ నిర్వాహకులు అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బంధుమిత్రులతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది.  గ్రామంలోని ప్రతి ఇల్లు బంధుమిత్రులతో కలకలలాడు తున్నది. ఈ కార్యక్రమాలలో గ్రామ ప్రముఖులు పెద్ద ఎత్తు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -