- Advertisement -
సీఎం రేవంత్రెడ్డి సూచన
హైదరాబాద్లో ఫ్రెంచ్ బ్యూరో కార్యాలయాన్ని మరింత బలోపేతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ బృందానికి సూచించారు. శనివారం ఆ బృందం సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యింది. ఫ్రాన్స్కు సంబంధించి హైదరాబాద్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై ఈ సందర్భంగా చర్చించారు. హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్ బృందాన్ని సీఎం కోరారు. సమావేశంలో మౌద్ మిక్వా, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



