Saturday, June 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఏఐతో విద్యానైపుణ్యాన్ని బలోపేతం చేయాలి

ఏఐతో విద్యానైపుణ్యాన్ని బలోపేతం చేయాలి

- Advertisement -

– స్టాన్లీ కాలేజీ సదస్సులో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ బాలకిష్టారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అధునాతన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో పరిశోధనలతోపాటు విద్యా నైపుణ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరముందని ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయాలు, అనుబంధ కాలేజీలు దీనిపై దృష్టిసారించాలని కోరారు. మెథడిస్ట్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం రెండురోజుల అంతర్జాతీయ సదస్సు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అధ్యక్షత వహించిన బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ ఏఐ ప్రాధాన్యత అన్ని రంగాల్లోనూ పెరుగుతున్నదని చెప్పారు. భవిష్యత్తును రూపొందించడంలో ఏఐ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. సిలబస్‌లోనూ ఏఐని చేర్చి విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఏఐ అండ్‌ ఎంఎల్‌ డైరెక్టర్‌ పివి సుధ మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ఇతర అవకాశాలుంటాయని వివరించారు. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మెథడిస్ట్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కరస్పాండెంట్‌ కె కృష్ణారావు, డైరెక్టర్‌ ఎం లక్ష్మీపతిరావు, ప్రిన్సిపాల్‌ ప్రభు జి బెనకాప్‌, అధ్యాపకులు లావణ్య పాములపర్తి, ఎం శారద వరలక్ష్మి, టి ప్రవీణ్‌కుమార్‌, యు మోలాలి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -